The Kerala Story | పాపులర్ నటి అదా శర్మ (Adah sharma) లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). హిజాబ్, లవ్ జిహాద్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సుదీప్తో సేన్ (Sudipto Sen) దర్శకత్వం వహించారు. లవ్ జిహాద్ ద్వారా కేరళకు చెందిన 32 వేల మందిని ముస్లిం మతంలోకి మార్చి, సిరియాకు తరలించారనే నేపథ్యంలో సాగే ఈ సినిమాను పలు వివాదాలు చుట్టుముట్టాయి. 2023 మే 5న విడుదల ఈ చిత్రం వివాదాల మధ్యే సక్సెస్ఫుల్గా స్క్రీనింగ్ అవుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది.
ది కేరళ స్టోరీని ప్రసారం చేయాలనే దూరదర్శన్ నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు.
ఈ సినిమా లోక్సభ ఎన్నికలకు ముందు మత విద్వేషాలు, ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తుందని.. ఈ నేపథ్యంలో సినిమా ప్రసారాన్ని నిలిపేయాలని సీఎం విజయన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ను కోరినట్లు తెలుస్తోంది. మరి దూరదర్శన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
సమాజంలో వర్గ విభేదాలు సృష్టించే లక్ష్యంతో నిర్మించిన వివాదాస్పద ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ప్రదర్శించడానికి వీలు లేదని అప్పట్లో కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా హెచ్చరించారు. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ దక్షిణాదిలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంలో సంఘ్ పరివార్ శక్తులు ఈ చిత్రాన్ని నిర్మించారని సీపీఎం , కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలని డిమాండ్ చేశాయి.
Kerala Chief Minister Pinarayi Vijayan condemns Doordarshan’s decision to telecast #TheKeralaStory
Vijayan has reportedly asked the public broadcaster to withdraw from screening movie, saying it would only “exacerbate communal tensions” ahead of the Lok Sabha polls pic.twitter.com/oQpYTO8St6
— Organiser Weekly (@eOrganiser) April 5, 2024