Adah Sharma | బాలీవుడ్ నటి ఆదాశర్మ ఓ నెటిజన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. గతేడాది ఆదాశర్మ నటించిన సూపర్ హిట్ చిత్రం ది కేరళ స్టోరీ. ఈ సినిమాపై విడుదలైన అనంతరం విపరీతమైన ట్రోలింగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ముస్లింలను టార్గెట్ చేస్తూ వారే విలన్లు అంటూ ఉండడంతో ఇది ఇక ప్రోపగండ మూవీ అని అసలైన కేరళ స్టోరీ కాదని నెటిజన్లు తిప్పికోట్టారు. అయితే రంజాన్ మాసం సందర్భంగా తాజాగా ఓ ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యింది ఆదాశర్మ. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియా వైరల్గా మారడంతో ఓ నెటిజన్ ఆదాశర్మను విమర్శిస్తూ పోస్టు పెట్టాడు.
నార్మల్ రోజులలో ముస్లింలను విలన్లుగా చిత్రికరిస్తూ వారిపై ద్వేషపూరిత సినిమాలు చేస్తుంది. అదే ఈవెన్ డేస్లో ముస్లింలు గొప్పవారు.. ఎందుకంటే నన్ను బిర్యానీ కోసం ఇన్వైట్ చేశారు. ఈమె ఎంత మోసం చేస్తుంది జనాలను అంటూ పోస్టు పెట్టాడు. దీనికి కౌంటర్గా ఆదాశర్మ డియర్ సర్.. ఏ రోజు అయిన సరే ఉగ్రవాదులు అనే వాళ్లు విలన్లు. ముస్లింలు కాదు అంటూ స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది.
On odd and even days dear sir terrorists are villains . Not muslims.
— Adah Sharma (@adah_sharma) March 26, 2024