Adah Sharma | నాలుగేళ్ల క్రితం ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు బాలీవుడ్ హీరో సుశాంత్సింగ్ రాజ్పుత్. వ్యక్తిగత, కెరీర్పరమైన కారణాల వల్ల తీవ్రమైన డిప్రెషన్తో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. ఆత్మహత్య ఉదంతం తర్వాత సుశాంత్ ఇంటిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకురాలేదు. దాదాపు నాలుగేళ్ల పాటు ఖాళీగా ఉన్న ఆ నివాసాన్ని ఈ మధ్యే కొనుగోలు చేసింది కథానాయిక ఆదాశర్మ. ఇంటిని పూర్తిగా రీమోడలింగ్ చేసి ఇటీవల కుటుంబంతో సహా అక్కడకు షిఫ్ట్ అయింది.
ఈ నేపథ్యంలో సుశాంత్ ఇంటిని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది అదాశర్మ. కేవలం పబ్లిసిటీ కోసమే తాను ఆ ఇల్లును కొన్నాననే ఆరోపణలను ఖండించింది. సుశాంత్ ఇల్లు తనకు ఎంతగానో నచ్చిందని, అక్కడ అడుగుపెట్టగానే పాజిటివ్గా అనిపించిందని, ఏదో తెలియని శక్తి ఇంట్లో ఉందనే భావన కలిగిందని చెప్పింది. ‘ఇంటిని మొత్తం రీమోడలింగ్ చేశా. మొదటి అంతస్తుని గుడిగా మార్చాను. టెర్రస్పై గార్డెన్ పెంచుతున్నా. మా అమ్మ, అమ్మమ్మతో కలిసి ఇక్కడే ఉంటున్నా’ అని అదాశర్మ తెలిపింది.