బాలీవుడ్ యువ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మూడేళ్ల క్రితం ముంబయిలోని తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణ ఇంకా కొసాగుతూనే ఉంది. ఇదిలావుండగా సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్లో అద్దెకు ఉండటానికి కూడా రెండేళ్ల పాటు ఎవరూ ముందుకురాలేదు. ఈ ఫ్లాట్ను విక్రయించే బాధ్యతను రియల్ ఎస్టేట్ బ్రోకర్ రఫీక్ మర్చంట్ తీసుకున్నారు.
ఆత్మహత్య చేసుకున్న ప్లాట్ కావడంతో అశుభంగా భావిస్తూ కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని రఫీక్ మర్చంట్ పలు సందర్భాల్లో తెలిపారు. తాజాగా ఈ ఫ్లాట్ను బాలీవుడ్ కథానాయిక ఆదాశర్మ ఖరీదు చేయబోతున్నదని ముంబయి మీడియాలో వార్తలొచ్చాయి. ఇటీవలే ఆమె ఆ ఫ్లాట్ను చూసొచ్చిందని చెబుతున్నారు. ఈ వార్తలపై ఆదాశర్మ స్పందిస్తూ ‘ఫ్లాట్ కొనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతా ఫైనలైజ్ అయ్యాక ఆ వివరాలను మీతో పంచుకుంటా’ అని చెప్పింది. ఖరీదైన ఏరియాలో అత్యంత విలాసవంతంగా ఉండే ఈ ఫ్లాట్ను మార్కెట్ రేటు కంటే చాలా తక్కువకు విక్రయిస్తున్నారని తెలిసింది.