SSMB28 | సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలుంటాయి. ఆ కాంబోలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు, సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అలాంటి కాంబోలలో మహేష్-త్రివిక్రమ్ ఒకటి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘అతడు’, ‘ఖలేజా’ క్లాసిక్ చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాలు కమర్షియల్గా అంతగా సక్సెస్ సాధించకోపోయినా బుల్లితెరపై మాత్రం ఘన విజయం సాధించాయి. ఇప్పటికీ ఈ రెండు చిత్రాలు టీవీలో వస్తున్నాయంటే ప్రేక్షకులు అతుక్కుపోతుంటారు. తినగా తినగా వేప తియ్యనుండు అనే విధంగా ఈ రెండు చిత్రాలు చూసిన ప్రతిసారి కొత్తగా ఎంటర్టైన్ అవుతూ ఉంటాం. ఇక దాదాపు 12ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి హ్యట్రిక్కు రెడీ అవుతున్నారు.
ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో మరో క్రేజీ అప్డేట్ తెగ వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ సినిమాలలో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఈయన తన సినిమాలలో పాత్రకు న్యాయం చేయగలిగే యాక్టర్లను మాత్రమే ఎంపికచేసుకుంటాడు. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో మహేష్బాబుతో పాటు మరో ప్రధాన హీరో కూడా ఉంటాడని, ఆ పాత్రకు నాని అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని త్రివిక్రమ్, నానిని సంప్రదించాడట. నానికి కూడా తన పాత్ర బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని చినబాబు నిర్మిస్తున్నాడు.