నటి ఊర్వశీ రౌటేలా, క్రికెటర్ రిషబ్ పంత్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తున్నది. ఈ నాయిక ఇటీవలి ఇంటర్వ్యూ వీళ్ల మధ్య వివాదం రేపింది. రిషబ్ పంత్ పేరు చెప్పకుండా ఆర్పీ అనే క్రికెటర్ తనను కలిసేందుకు గంటల పాటు వేచి చూశాడని ఊర్వశీ రౌటేలా చెప్పుకుంది. ఆర్పీ అంటే రిషబ్ పంత్ అనే అనుకుంటున్నారు. ఈ ఊహకు కారణం వీరిద్దరి మధ్య గతంలో ప్రేమ కథ నడిచిందనే రూమర్స్ ఉండటమే. అయితే ఊర్వశీ వ్యాఖ్యలను రిషబ్ పంత్ ఖండించాడు. ‘నా వెంట పడటం మానుకో సోదరి, ప్రచారం కోసం, మీడియాలో హైలైట్ అయ్యేందుకు ఇలా అసత్యాలు మాట్లాడటం తప్పు’ అని పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత పోస్ట్ను కొన్ని గంటల్లోనే తొలగించాడు. ‘ఛోటూ భయ్యా ఇవన్నీ వదిలేసి క్రికెట్ మీద దృష్టి పెట్టు, నేను నువ్వు అనుకునే తరహా అమ్మాయిని కాదు’ అని రిైప్లె ఇచ్చింది ఉర్వశీ రౌటేలా. ఇలా వీరి మధ్య మాటల యుద్ధం కాసేపు నెటిజన్లకు వినోదాన్ని పంచింది.