ఇప్పుడంటే సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. చీమ చిటుక్కుమన్నా కూడా వెంటనే మనకు అప్డేట్ వచ్చేస్తుంది. ప్రతి అప్డేట్ నిమిషాల్లో తెలిసిపోతుంది. కానీ ఒకప్పుడు పరిస్థితులు అలా లేవు. 20 ఏళ్ల కిందటి వరకు కూడా సినిమా షూటింగ్ గోప్యంగా జరిగేది. ఆ టైంలో ఏం జరిగినా బయటకు తెలిసేది కాదు. అలా కొన్నేళ్ల కింద ఒక సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం గురించి ఇప్పటివరకు బయట తెలియలేదు. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ బయటకి వచ్చి చెబితే తప్ప ఎవరికీ దీనిపై క్లారిటీ కూడా లేదు. ఇంతకీ అ సినిమా ఏంటని అనుకుంటున్నారా? 19 ఏళ్ల క్రితం తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా పరిచయమైన జయం సినిమా చిత్రీకరణ సమయంలో ఈ ఘటన జరిగింది.
నితిన్, సదా జంటగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా సంచలన విజయం సాధించింది. 2002 లో విడుదలైన ఈ సినిమా దాదాపు 15 కోట్ల షేర్ వసూలు చేసి అప్పట్లో స్టార్ హీరోల సినిమాలకు కూడా సవాల్ విసిరింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన హీరోయిన్ సదా ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది. అప్పట్లో జయం సినిమా కోసం అడవిలో షూటింగ్ చేశారు. అది నెల్లూరు సమీపంలో ఉంది. ప్రతిరోజు అక్కడికి ఒక వాహనంలో నితిన్, సదా మరో ఇద్దరు ప్రయాణం చేసే వాళ్లు. అయితే అనుకోకుండా ఒక రోజు వాళ్లు ప్రయాణిస్తున్న వాహనం టైర్ పేలింది. అంతే ఆ వాహనం మూడు పల్టీలు కొట్టింది. కళ్లు తెరిచి చూద్దామంటే కూడా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రాణం పోతుందేమో అని భయం. అంటూ ఆనాటి దారుణమైన ఘటనను గుర్తు చేసుకుంది సదా. ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ భయమేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమం
‘మా’పై నాగబాబు మాటలు బాధించాయి: నటుడు నరేశ్
ఉదయ్ కిరణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
చిరంజీవి సినిమాపై ఈ కన్ఫ్యూజన్ ఇంకెన్ని రోజులో.. ?
మాస్ట్రో : ఓటీటీలో నితిన్ సినిమా ?
19 ఏళ్ల కెరీర్ లో నితిన్ వదిలేసిన సినిమాలివే..!
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే