Priyamani | సెకండ్ ఇన్నింగ్లో ప్రియమణి దూసుకెళ్తోంది. హీరోయిన్గా కెరీర్ ముగిసిపోయిన సమయంలో వచ్చిన ఫ్యామిలీమ్యాన్ వెబ్సిరీస్ ఆమెకు బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలో వరుస హిట్స్తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా బాలీవుడ్లోనూ మంచి పేరే తెచ్చుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్స్ గురించి సీక్రెట్స్ బయటపెట్టింది. భామా కలాపం 2 ప్రమోషన్స్లో పాల్గొన్న ప్రియమణి.. పలువురు హిందీ హీరోయిన్ల గుట్టు రట్టు చేసింది.
ఎయిర్పోర్టులు, జిమ్ల దగ్గర సెలబ్రెటీలు కనబడగానే ఫొటోగ్రాఫర్లు పరిగెత్తుకెళ్లి మరీ ఫొటోలు తీస్తుంటారు. సెలబ్రెటీల స్టిల్స్ కోసం ఫొటోగ్రాఫర్స్ ఎగబడుతుంటారు. దీన్ని పపరాజీ కల్చర్ అని కూడా అంటుంటారు. అప్పుడప్పుడు సోషల్మీడియాలో వైరల్ అయ్యే ఇలాంటి సీన్స్ మనం చూసే ఉంటాం. అయితే సరిగ్గా హీరోయిన్లు ఎయిర్పోర్టు నుంచి వస్తుంటూనే.. ఎయిర్పోర్టులోకి వెళ్తుంటేనో ఫొటోగ్రాఫర్లకు ఈ విషయం ఎలా తెలుస్తోంది. ఫొటోగ్రాఫర్లు రోజంతా ఎయిర్పోర్టులు, జిమ్ల దగ్గర పడిగాపులు కాస్తుంటారా? అనే అనుమానం చాలామందికి వచ్చే ఉంటుంది. అయితే దీని వెనుక ఉన్న సీక్రెట్నే ప్రియమణి బయటపెట్టింది. సెలబ్రెటీలే డబ్బులిచ్చి ఇలా ఫొటోలు తీయించుకుంటారని తెలిపింది.
ఇదంతా పీఆర్ స్ట్రాటజీ అని.. వాళ్లే సెలబ్రెటీల గురించి సమాచారం అందించి, పనైపోయాక డబ్బులు ఇస్తారని ప్రియమణి షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. జవాన్ సినిమా చేసిన తర్వాత ముంబైకి వెళ్తే ఓ ఏజెన్సీ వ్యక్తి తనకు కలిసి ఈ విషయం చెప్పాడని ప్రియమణి తెలిపింది. ఈ పపరాజీ కల్చర్కు సంబంధించి ఎంత ఖర్చవుతుందనే దానిపై ఛార్జీల వివరాలు కూడా పంపించారని పేర్కొంది.