పచ్చదనం పెంచేందుకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ప్రకృతి హిత కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఐదు వసంతాలుగా దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో సినీ తారలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా నటి నవీన జాక్సన్ విసిరిన చాలెంజ్ స్వీకరించిన నాయిక అమీక్ష పవార్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొని మొక్కలు నాటింది.
తనకీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం ఆనందంగా ఉందన్న అమీక్ష…వాయు కాలుష్యం నుంచి మనల్ని కాపాడేవి మొక్కలే అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చారు. నటీనటులు విజయ్ శంకర్, దివాకర్, ప్రాచీ ఠాక్రేలకు అమీక్ష ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ విసిరారు.