ఉజ్జయినీ: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడిని (Mahakaleshwar Temple) హీరోయిన్ రాశీ ఖన్నా , బాలీవుడ్ నటి వాణీ కపూర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న రాశీ ఖన్నా (Raashi Khanna) మహాకాళేశ్వరుడి తొలి పూజలో పాల్గొన్నారు. కాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆ భగవంతుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని రాశీ ఖన్నా అన్నారు. మహాకాల్ మమ్మల్ని మళ్లీ పిలుస్తారని ఆశిస్తున్నానన్నారు. ఇది ఒక గొప్ప అనుభూతని నటి వాణీ కపూర్ వెల్లడించారు.
Raashi
#WATCH | Madhya Pradesh: Actors Raashii Khanna says, “It was a delight. I hope Mahakal calls us again.”
Actor Vaani Kapoor says, “It was a great feeling…” https://t.co/thHQnx00G4 pic.twitter.com/tvKTApxAbU
— ANI (@ANI) May 28, 2024