చెన్నై : మిచౌంగ్ తుఫాను (Michaung Cyclone) తమిళనాడు రాజధాని చెన్నైని వరదలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ వర్షాల ధాటికి వరదలు పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. చెంబరంబాక్కమ్లో కురిసిన భారీ వర్షాల వల్ల చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ నదులు, సరస్సులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇండ్లపైకి చేరారు. ఇప్పటికే సినీ నటుడు విశాల్ చెన్నై వరదల పరిస్థితిని ఓ వీడియో ద్వారా వివరిస్తూ.. చెన్నై మేయర్తోపాటు అధికార యంత్రాంగంపై మండిపడ్డాడు.
కాగా తాజాగా మరో యాక్టర్ విష్ణువిశాల్ (Vishnu Vishal) వరద ముంపులో చిక్కుకున్న ఫొటోలను షేర్ చేస్తూ.. దయనీయ స్థితిని ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు. మా ఇంట్లోకి నీళ్లొస్తున్నాయి. కరపాక్కమ్లో నీటి మట్టం అంతకంతకూ పెరిగిపోతుంది. నేను సాయం కోసం అర్థించా. కరెంట్ లేదు.. వైఫై లేదు.. ఫోన్ సిగ్నల్తోపాటు ఏ సౌకర్యాలు లేకుండా పోయాయి. టెర్రస్పైన ఓ ప్రదేశంలో మాత్రమే కొంత సిగ్నల్ వచ్చింది. నాతోపాటు చాలా మంది జనాలకు సాయం అందుతుందని ఆశిస్తున్నా. చెన్నైలో ఉన్న ప్రజల తరపున నా ఆవేదన తెలియజేస్తున్నానని ట్వీట్ చేశాడు.
అక్కడి పరిస్థితిని అందరికి తెలియజేసేలా ఫొటోలను షేర్ చేశాడు. చెన్నై వరదల పరిస్థితిని కండ్లకు కట్టినట్టుగా మరోసారి చూపిస్తున్న విష్ణువిశాల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కూవమ్ నది (Koovam river) ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నెర్కుంద్రమ్ ప్రాంతంలోని బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తున్నట్టు ఇప్పటికే అప్డేట్స్ వచ్చాయి. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో చెన్నైలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు.
వరద ముంపులో విష్ణు విశాల్..
Water is entering my house and the level is rising badly in karapakkam
I have called for help
No electricity no wifi
No phone signal
Nothing
Only on terrace at a particular point i get some signal
Lets hope i and so many here get some help❤️
I can feel for people all over chennai… pic.twitter.com/pSHcK2pFNf— VISHNU VISHAL – VV (@TheVishnuVishal) December 5, 2023