విజయ్శంకర్, అషూరెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫోకస్’. సుహాసిని, భానుచందర్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. సూర్యతేజ దర్శకుడు. రిలాక్స్ మూవీ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్ర టీజర్ను సోమవారం ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రెగ్యులర్ క్రైమ్ కథలకు భిన్నంగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ మూడోవారంలో ప్రేక్షకుల మందుకు తీసుకొస్తాం’ అని దర్శకుడు తెలిపారు. జీవా, షాయాజీషిండే, భరత్రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జె.ప్రభాకర్ రెడ్డి, సంగీతం: వినోద్యాజమాన్య, సాహిత్యం: కాసర్ల శ్యాం, దర్శకత్వం: జి.సూర్యతేజ.