ఇటీవల తలపతి విజయ్, తల ధోనీ చెన్నైలోని గోకులం స్టూడియోలో కలిసిన సంగతి తెలిసిందే. యాడ్ షూటింగ్ కోసం ధోని అక్కడికి వెళ్లగా, బీస్ట్ సినిమా షూటింగ్ని అక్కడే చేస్తున్న విజయ్ని కలిసాడు. ఈ ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు.వారి మధ్య సుమారు గంట పాటు సంభాషణ జరిగింది.
ఇప్పపటికీ ధోని, విజయ్ కలిసినప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. అయితే ఈ ఫొటోలతో విజయ్ అభిమానులు వివాదం సృష్టించారు. ఎంఎస్ ధోనీ ఈ దేశానికి ప్రధాన మంత్రి గానూ.. రాష్ట్రానికి సీఎంగా విజయ్ ఉండాలని పోస్టర్లు చేసి,ఈ పోస్టర్లను తమిళనాడులోని మధురైలో అంటించారు. దీనిపై ధోని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే ధోనికి ఇలాంటివి అంటకట్టొదని కొందరు అభిమానులు మండిపడుతున్నారు.
కాగా, 2008లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లాంచ్ చేసినప్పుడు విజయ్ ఆ టీమ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ బీస్ట్ చిత్ర షూటింగ్తో బిజీగా ఉండగా, ఈ సినిమాని వచ్చేఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తుంది. ఇక ధోనీ ఐపీఎల్ కోసం ఈ నెల 13న చెన్నై టీమ్తో కలిసి దుబాయ్ వెళ్లనున్నాడు.