‘జై భీమ్’ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు అగ్ర నటుడు సూర్య. ప్రస్తుతం ఆయన వరుస భారీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఆయన ఓ హిందీ చిత్రంలో నటించబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..‘ఖుదాఫీస్’ ఫేమ్ దర్శకుడు ఫరూఖ్ కబీర్ ఓ పాన్ ఇండియా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా కథను ఇటీవలే సూర్యకు వినిపించగా..ఆయన అంగీకరించారని తెలిసింది. ఈ విషయాన్ని దర్శకుడు ఫరూఖ్ కబీర్ వెల్లడించారు. ఇదిలావుండగా ప్రస్తుతం సూర్య బాలా దర్శకత్వంలో ‘వణంగాన్’ చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు సుధ కొంగర దర్శకత్వంలో ఓ చిత్రానికి అంగీకరించారు. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేళ్తో ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవల విడుదలైన ‘విక్రమ్’, ‘రాకెట్రీ’ చిత్రాల్లో సూర్య అతిథి పాత్రల్లో ఆకట్టుకున్నారు.