యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు హీరో సుధీర్ బాబు. భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శనివారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభోత్సవం జరిగింది. ‘యాక్షన్ సినిమాలు చేయాలనే కోరిక ఉండేదని. అది ఈ సినిమాతో తీరుతున్నదని, ఏదో ఒకట్రెండు ఫైట్స్ కాకుండా పూర్తిగా యాక్షన్ నేపథ్యంతో సినిమా సాగుతుందని’ అన్నారు హీరో సుధీర్ బాబు. దర్శకుడు మహేష్ మాట్లాడుతూ..‘విభిన్న తరహాలో సాగే యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది’ అన్నారు. ‘పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో సుధీర్ బాబు కనిపిస్తారని, మార్చి 14 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తామని’ అన్నారు నిర్మాత వి ఆనంద్ ప్రసాద్.