బెంగళూరు: కన్నడ సూపర్స్టార్ పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. బెంగళూరులోని కంఠీరవ మైదానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్ అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు రాజ్కుమార్, పార్వతమ్మ సమాధుల వద్దే పునీత్ అంత్యక్రియలు చేస్తున్నారు. అంత్యక్రియల్లో సీఎం బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, పలువురు సినీ నటులు పాల్గొన్నారు. తమ అభిమాన నటుడిని చివరిసారిగా చూసుకోవడానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. పునీత్ సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్తో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
శుక్రవారం ఉదయం తన ఇంట్లో వ్యాయామం చేస్తుండగా పునీత్ రాజ్కుమార్కు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన దవాఖానకు తరలించారు. విక్రమ్ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
#WATCH | Mortal remains of Kannada actor Puneeth Rajkumar being carried to Sree Kanteerava Studios in Bengaluru, where his last rites will be performed today pic.twitter.com/xHyBYL6Rxt
— ANI (@ANI) October 31, 2021