Prakash Raj – Pawan Kalyan | తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు నూనెలు వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని.. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని పవన్ అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి నిర్మూలించాలని పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చేలరేగింది. ప్రజల ఎన్నుకున్న పదవిలో ఉండి మత విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నాడు పవన్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఎక్స్ వేదికగా పవన్కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
”డియర్ పవన్ కళ్యాణ్ గారు. తిరుమల లడ్డూ వివాదం ప్రస్తుతం మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే జరిగింది. దయచేసి దీనిపై విచారణ జరపండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరో కనిపెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించండి. అది వదిలేసి మీరు ప్రజల్లో భయం పెంచుతూ దీన్ని జాతీయ స్థాయి సమస్యగా చూపించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే సరిపడా మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి (సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతున్న మీ మిత్రుల వల్ల) అందుకే ఇలాంటివి మానుకోండి.” అంటూ ప్రకాశ్ రాజ్ రాసుకోచ్చాడు.
Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l
— Prakash Raj (@prakashraaj) September 20, 2024