ముంబై: ఈ ప్రపంచంలో కరోనా కాలు మోపినప్పటి నుంచి గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా పదేళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయస్సుల వాళ్లలో గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశంలో ఈ మధ్య గుండెపోటుతో మరణిస్తున్న సినిమా వాళ్ల సంఖ్య పెరుగుతున్నది. సిద్ధార్థ్ శుక్లా, పునీత్ రాజ్కుమార్లు గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హిందీ, తమిళ భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న నటుడు పవన్ గుండెపోటుతో మృతిచెందాడు.
ముంబైలో తెల్లవారుజామున 5 గంటలకు ఛాతిలో తీవ్రంగా నొప్పి రావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. పవన్ స్వస్థలం కర్ణాటకలోని మాండ్యా జిల్లా. దాంతో ఆయన మృతదేహాన్ని మాండ్యాకు తరలించారు. అక్కడ పవన్ కుటుంబసభ్యులు ఆయనకు అంతిమ సంస్కారాలు చేయనున్నారు.