హైదరాబాద్ : సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, టాలీవుడ్ నటుడు మహేశ్బాబు సోదరుడు, నిర్మాత ఘట్టమనేని రమేశ్బాబు శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనను ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. రమేశ్బాబు (56) మృతితో టాలీవుడ్లో విషాదం అలుముకున్నది. రమేశ్బాబు 1987లో ‘సామ్రాట్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.
అంతకు ముందు టీనేజ్లో ఉండగా దాసరి నారాయణరావు ఆయన ప్రధాన పాత్రధారిగా ‘నీడ’ (1979) చిత్రాన్ని తీశారు. వీ మధుసూదనరావు డైరెక్ట్ చేసిన ‘సామ్రాట్’లో హీరోయిన్గా అప్పటి సెన్సేషనల్ బాలీవుడ్ నటి సోనమ్ నటించింది. హీరోగా దాదాపు దశాబ్దం పాటు నటించగా.. 1997లో తండ్రి కృష్ణతో కలిసి నటించిన ‘ఎన్కౌంటర్’ ఆయన చివరి చిత్రం. ఆ తర్వాత నటనకు స్వస్తి పలికిన ఆయన నిర్మాతగా మారి పలు చిత్రాలను నిర్మించారు. అక్టోబర్ 13, 1965లో జన్మించిన ఆయన.. అల్లూరి సీతారామరాజులో బాలనటుడి చిత్రరంగ ప్రవేశం చేశారు. సుమారు 15 చిత్రాల్లో హీరోగా నటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు గురించి ఈ విషయాలు తెలుసా!
Bangarraju | బంగార్రాజు సినిమాలో 8 మంది హీరోయిన్లు.. ఎవరెవరంటే..
Anupama | లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్..