ముంబై: బాలీవుడ్ సినిమా నటుడు సునీల్ ష్రాఫ్ ఇక లేరు. శనివారం ఉదయం ఆయన కన్నుమూశారు. అయితే, సునీల్ ష్రాఫ్ మరణానికి కారణం ఏమిటనే విషయం ఇంకా తెలియరాలేదు. కానీ, గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన మరణానికి అదే కారణమై ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల విడుదలైన ‘OMG 2’ సినిమాలో పంకజ్ త్రిపాఠి, అక్షయ్ కుమార్లతో కలిసి సునీల్ ష్రాఫ్ నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి పేరు దక్కింది. అదేవిధంగా విడుదలకు సిద్ధంగా ఉన్న ‘షిదత్ (Shidat)’ సినిమాలో కూడా ఆయన నటించారు. సునీల్ ష్రాఫ్ మృతికి సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సంతాపం తెలిపింది.