Thalapathy Vijay | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్ మొదలైంది. ఇక తమిళనాడులో కూడా తొలి దశలోనే పోలింగ్ జరుగుతుండగా.. సాధారణ ప్రజలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తాజాగా తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) పార్టీ అధినేత సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. చెన్నైలోని సాధారణ ప్రజలతోపాటు క్యూలైన్లో నిలబడి
చెన్నైలోని నీలంకరైలోని పోలింగ్ బూత్లో సాధారణ ప్రజలతోపాటు క్యూలైన్లో నిలబడి విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#WATCH | Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam president Vijay casts his vote at a polling booth in Neelankarai, Chennai#LokSabhaElections2024 pic.twitter.com/rTtu4tGZJy
— ANI (@ANI) April 19, 2024