పేటా, మాస్టర్ సినిమాలతో దక్షిణాదిన గుర్తింపుతెచ్చుకున్న తార మాళవికా మోహన్. ప్రస్తుతం విక్రమ్ హీరోగా పా.రంజిత్ తెరకెక్కిస్తున్న ‘తంగలాన్’ సినిమాలో నాయికగా నటిస్తున్నది ఈ అందాలభామ. ఇటీవల మాళవిక సరదాగా తన ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. ‘తంగలాన్’ ఆలస్యం గురించి అభిమానులు అడగ్గా ‘ ఈ విషయం పా రంజిత్ని అడగాలి. నా వరకూ ‘తంగలాన్’ ప్రత్యేకమైన సినిమా.
నటిగా అందులోని పాత్ర నాకో సవాల్. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అది’ అని చెప్పారు మాళవికా. మీ ఇష్టమైన హీరో ఎవరు? అనడిగితే తడుముకోకుండా ‘ఫహాద్ ఫాజిల్’ అని చెప్పేసింది మాళవిక. మిగతా హీరోలకు కోపం వస్తే?.. అనంటే, ‘రానివ్వండి అబద్ధాల్లో బతకలేను. నా అభిప్రాయం చెప్పా’ అనేసింది ధైర్యంగా. డ్రీమ్రోల్ ఏమైనా ఉందా? అనడిగితే.. ‘రాజకుమారిగా పీరియాడికల్ సినిమాలో చేయాలనుకుంది’ అంటూ మనసులోని కోరిక బయటపెట్టింది మాళవిక.