న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ముంబైలోని వర్లీ ప్రాంతంలో తన లగ్జరీ ఫ్లాట్ను దాదాపు రూ 46 కోట్లకు విక్రయించాడు. బచ్చన్ 2014 నవంబర్లో ఒబెరాయి రియల్టీ డెవలప్ చేసిన ఈ ప్రాజెక్టులోని అపార్ట్మెంట్ను రూ 41.14 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇదే ప్రాజెక్ట్లో ప్రముఖ బ్యాంకర్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఎండీ, సీఈవో రమేష్ సొబ్టి రూ 76.30 కోట్లకు రెండు సముద్రం అభిముఖంగా ఉన్న ప్లాట్లను కొనుగోలు చేశాడు.
ఈ ప్రాజెక్టులో పలువురు హైప్రొఫైల్ ప్రొఫెషనల్స్, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖలు ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఇక అభిషేక్ బచ్చన్ ఈ డీల్పై రూ 2.28 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించాడు. అభిషేక్ ఫ్లాట్ టవర్ బీలోని 37వ ఫ్లోర్లో 7527 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిఉంది. ఈ అపార్ట్మెంట్ యజమానికి నాలుగు కార్లు పార్క్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఇక కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉత్తేజం కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని తగ్గించడంతో ముంబైలో లగ్జరీ ప్రాపర్టీ కొనుగోళ్లు ఊపందుకున్నాయి.గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జులై మధ్య గ్రేటర్ ముంబైలో 1.13 లక్షల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.