ప్రముఖ నిర్మాత డి.సురేష్బాబు తనయుడు అభిరామ్ కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఫస్ట్గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో హీరో అభిరామ్ను అటవీ ప్రాంతంలో ఓ రౌడీ గ్యాంగ్ అటకాయించి ముఖంపై జూట్ బ్యాగ్ కప్పి దాడి చేయడం కనిపిస్తున్నది.
‘ఓ విభిన్న కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సామాజికాంశాల్ని స్పృశిస్తూ సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అభిరామ్ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది’ అని చిత్రబృందం తెలిపింది. గీతిక, రజత్ బేడీ, రవి కాలే, కమల్ కామరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: ఆర్పీ పట్నాయక్, సాహిత్యం: చంద్రబోస్, సంభాషణలు: అనిల్ అచ్చుగట్ల, నిర్మాణ సంస్థ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, నిర్మాత: పి.కిరణ్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: తేజ.