ప్రముఖ నిర్మాత డి. సురేష్బాబు తనయుడు అభిరామ్ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అహింస’ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. గీతిక తివారీ కథానాయిక. సదా, కమల్కామరాజు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ‘కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అంతర్లీనంగా చక్కటి సందేశంలో ఉంటుంది. తేజ తనదైన శైలిలో రూపొందించారు. ప్రీలుక్కు మంచి స్పందన లభించింది’ అని చిత్రబృందం పేర్కొంది. రజత్ బేడీ, సదా, రవి కాలే, మనోజ్ టైగర్, కల్పలత, దేవిప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: ఆర్పీ పట్నాయక్, సంభాషణలు: అనిల్ అచ్చుగట్ల, సాహిత్యం: చంద్రబోస్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: తేజ.