‘సాధారణంగా నేను సినిమా విడుదలకు ముందే ఇండియాలోని ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషన్స్ చేస్తాను. ఆ కోవలోనే ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను’ అన్నారు బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్. మరో కథానాయకుడు ఆయుష్తో కలిసి సల్మాన్ఖాన్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘అంతిమ్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా బుధవారం ‘అంతిమ్’టీమ్తో కలిసి సల్మాన్ హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అంతిమ్ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రం చేశాను. ‘దబాంగ్’లో నేను చేసిన చుల్బుల్ పాండేకు అంతిమ్లో చేసిన పోలీస్ఆఫీసర్ పాత్రకు పూర్తి భిన్నంగా డిజైన్ చేశారు. ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ప్రదర్శన సమయంలో కొందరు అభిమానులు థియేటర్లో టపాసులు కాల్చారు. ఆ విషయం నా దృష్టికి రావడంతో సోషల్మీడియా ద్వారా వారిని వద్దని వారించాను. అది వర్క్ అయ్యింది. ఇప్పుడు పాలాభిషేకం కోసం ఉపయోగించే పాలను అభిమానులు పేదలకు పంచి పెడుతున్నారని ఆనందపడ్డాను. చిరంజీవి గారితో తెలుగులో ఓ సినిమా చేస్తున్నాను. వెంకటేష్తో కూడా కలిసి నటించబోతున్నాను. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాను’ అన్నారు. ఆయుష్ శర్మ మాట్లాడుతూ సల్మాన్ఖాన్తో కలిసి నటించడం వల్ల ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యాను. ఆయనతో కలిసి నటించాలనే నా కోరిక తీరింది. భవిష్యత్లో మరిన్ని వైవిధ్యమైన సినిమాలతో, ప్రేక్షకులను ఆకట్టుకుంటాను’ అన్నారు.