Sai Pallavi | బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ఖాన్ (Amir khan) కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan) హీరోగా ఎంట్రి ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ నటి సాయి పల్లవి కథనాయికగా నటిస్తుంది. ప్రేమకథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సునీల్పాండే దర్శకత్వం వహించబోతున్నాడు. యశ్రాజ్ ఫిలింస్ బ్యానర్లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం జపాన్లో షూటింగ్ జరుపుకుంటుంది.
జపాన్లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో సపోరో స్నో(Sapporo snow festival) ఫెస్టివల్ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ ఫెస్టివల్ను చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు జపాన్కు వస్తుంటారు. అయితే ఈ ఫెస్టివల్లోనే సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే షూటింగ్లో బ్రేక్ వచ్చిన అనంతరం జునైద్ ఖాన్ – సాయి పల్లవి సపోరో స్నో ఫెస్టివల్లో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలావుండగా.. సాయి పల్లవి మరోవైపు తెలుగులో నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమా చేస్తుంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో పల్లెటూరి పదహరాణాల తెలుగు అమ్మాయిగా సాయి పల్లవి కనిపించి యూత్ ను సంబురాల్లో మునిగిపోయేలా చేసింది. ఇదికాకుండా తమిళంలో శివకార్తికేయన్ తో కలిసి యాక్షన్ డ్రామా సినిమా చేస్తుంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు.