Aamir Khan | సినిమాల నుంచి ప్రస్తుతం విరామం తీసుకున్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల తర్వాత ఆయన కొత్త సినిమాలేవీ అంగీకరించలేదు. ఎన్నో ఆశలతో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయం పాలవడంతో అమీర్ నిరాశ చెందారు. దీంతో సినిమాలకు విరామం ఇచ్చి కుటుంబంతో గడిపేందుకు సమయం వెచ్చిస్తానని గతంలోనే వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ స్టార్ హీరో ముంబైను వదిలి చెన్నైకు షిఫ్ట్ అవ్వతున్నట్లు తెలుస్తుంది. అయితే సడన్గా అమీర్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని అభిమానులు కంగారు పడుతున్నారు. ఇక అమీర్ ఖాన్ షిప్ట్ అవ్వడానికి ముఖ్య కారణం అతని తల్లి అరోగ్య పరిస్థితే.
అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం చెన్నైలో ఉండి చికిత్స పొందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమీర్ కూడా ఆమెకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. అందుకే కొన్ని నెలల పాటు చెన్నైలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడట. అందుకు అనుగుణంగా తన తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి సమీపంలోనే ఉన్న ఏదైనా హోటల్లో బస చేయాలని ఆమీర్ అలోచిస్తున్నట్లు సమాచారం. ఇక నటనకు విరామం ఇచ్చిన అమీర్ ఖాన్ తన పూర్తి సమయాన్ని తన కుటుంబానికి అంకితం చేస్తానని ఒక ఈవెంట్లో చెప్పిన విషయం తెలిసిందే.