ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ గురువారం ప్రారంభమైంది. వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ పతాకంపై తూము నరసింహా, జామి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత దిల్రాజు క్లాప్నివ్వగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విఛాన్ చేశారు.
‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆదిసాయికుమార్తో చేస్తున్న చిత్రమిదని, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. మురళీధర్ గౌడ్, పృథ్వీ, రఘు బాబు, అనివాష్, రచ్చ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్, సంగీతం: అనూప్రూబెన్స్, సంభాషణలు: రాము మన్నార్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్ చౌదరి.