ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. శివశంకర్ దేవ్ దర్శకుడు. అజయ్ శ్రీనివాస్ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పుస్కూర్ రామ్మోహన్రావు క్లాప్నివ్వగా. కె.ఎస్.రామారావు కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. పోలీస్ అధికారిగా ఆదిసాయికుమార్ కనిపిస్తారు’ అని తెలిపారు. తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిదని ఆది సాయికుమార్ చెప్పారు ఈ చిత్రానికి సంగీతం: అనీష్ సోలోమాన్, సినిమాటోగ్రఫీ: శేఖర్.