‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’ వంటి సూపర్హిట్ చిత్రాల హీరో ఆది సాయికుమార్, ‘అహ నా పెళ్ళంట!’, ‘పూలరంగడు’ వంటి సూపర్హిట్ చిత్రాల దర్శకుడు ఎం. వీరభద్రం కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి కిరాతక అనే టైటిల్ని ఫిక్స్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక హీరోయిన్గా పాయల్ రాజ్పుత్కి ఛాన్సిచ్చారు.
మంచి సక్సెస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాయల్.. ఆది సినిమాతో అయిన కెరీర్లో మరో హిట్ కొట్టాలని భావిస్తుంది. పాయల్కు ఆర్ ఎక్స్ 100 చిత్రం తప్ప మరో సినిమా విజయం దక్కలేదు.కాగా, కిరాతక సినిమాని విజన్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ పతాకాలపై నాగం తిరుపతి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాతలుగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఆది, వీరభద్రం కాంబినేషన్లో చుట్టాలబ్బాయి అనే చిత్రం రూపొందిన విషయం తెలిసిందే.