‘నేను… శైలజ’ తో డీసెంట్ హిట్ అందుకున్న కిశోర్ తిరుమల ఇప్పుడు శర్వానంద్, రష్మిక ప్రధాన పాత్రలలో ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు.ముందుగా ఈ కథని సీనియర్ హీరో వెంకటేశ్కి కథ చెప్పడం, ఆయన నచ్చి ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. కానీ, ఎందుకో ప్రాజెక్ట్ పనులు ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు చిత్రాలు చేస్తూ కెరీర్ సాగిస్తున్నారు.
శర్వానంద్, రష్మిక ప్రధాన పాత్రలలో కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఆడాళ్లు మీకు జోహార్లు చిత్ర ఫస్ట్ లుక్ని ఈ రోజు దసరా పండుగ సందర్భంగా విడుదల చేశారు మేకర్స్.దసరా కానుకగా ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఇక ఇంట్లో పండుగ వాతావరణాన్ని తలపించేలా.. గుమ్మానికి పూల తోరణాలు కట్టేశారు. ఇందులో రష్మిక, శర్వా ఇద్దరూ తెగ నవ్వులు చిందిస్తున్నారు.
చిత్రంలోకుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు.