స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో వివాహానంతరం సినిమాలకు బ్రేక్ తీసుకుంది అగ్ర కథానాయిక అనుష్కశర్మ. సినిమాల ఎంపికలో సెలెక్టివ్గా ఉంటూ పాత్రలపరంగా వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తుందని ఆమెకు బాలీవుడ్లో మంచి పేరుంది. ఈ నేపథ్యంలో అనుష్కశర్మ కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ను మొదలుపెడుతూ తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్ట్లో భాగం కాబోతున్నట్లు తెలిసింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ ఫాంటసీ చిత్రంలో అనుష్క శర్మ కీలక పాత్రలో నటించనుందని వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ ప్రాజెక్ట్పై భారీ హైప్ నెలకొని ఉంది.
ఈ సినిమాలో అనుష్కశర్మ నటించడం ఖాయమని, ఇప్పటికే చిత్రబృందం ఆమెతో చర్చల్ని పూర్తి చేసిందని బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. రెండు సమాంతర ప్రపంచాల నేపథ్య కథాంశంతో హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీపికా పడుకోన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఏఏ22’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో పూర్తవబోతున్నట్లు సమాచారం.