అభిరామ్, భద్రమ్, అమీక్షా పవార్, జస్విక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘రెక్కీ’. ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకందవు’ ఉపశీర్షిక. ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకుడు. కమలకృష్ణ నిర్మాత. సోమవారం ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెలుగులో ఇప్పటివరకు రానటువంటి కథ ఇది. ఆద్యంతం అనూహ్య మలుపులతో ఆసక్తినిరేపుతుంది’ అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. నాగరాజు, దేవిచరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ గంగాధరి, బ్యాక్గ్రౌండ్ స్కోర్: చిన్నా, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్.