సూర్య కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘24’ (2016) చిత్రం ఇన్నోవేటివ్ కథాంశంతో దక్షిణాది ప్రేక్షకుల్ని మెప్పించింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో ఓ విభిన్నమైన సినిమాగా మిగిలిపోయింది. సూర్య ద్విపాత్రాభినయంలో ఆకట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ను నిర్మించేందుకు హీరో సూర్య, దర్శకుడు విక్రమ్ కుమార్ సిద్ధమవుతున్నారని తెలిసింది. మొదటి భాగంలో గతంలోకి చేసిన ప్రయాణాన్ని చూపించగా..సీక్వెల్లో భవిష్యత్తు ప్రయాణం తాలూకు ఫాంటసీ అంశాల్ని ఆవిష్కరించబోతున్నారని తెలుస్తున్నది. ఈ సీక్వెల్ కోసం దర్శకుడు విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారని..ఈ ఏడాదే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.