బాలీవుడ్ నటుడు నవాజుద్దీజ్ సిద్ధిఖీపై కోల్కతాలో కేసు నమోదైంది. ఓ బహుళ జాతి సంస్థ శీతల పానీయానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ విడుదల చేసిన తాజా ప్రకటనలో ఆయన కనిపించారు. అయితే ఇందులోని కొన్ని సంభాషణలు బెంగాలీ సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని దిబ్యయాన్ బెనర్జీ అనే న్యాయవాది కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నవాజుద్దీన్ సిద్ధిఖీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
‘బెంగాలీలకు నెయ్యి దొరక్కపోతే వారు రాత్రిళ్లు ఆకలితో అలమటిస్తూ నిద్ర కూడా పోలేరు’ అంటూ యాడ్లో వచ్చే వ్యంగ్య సంభాషణ ఆక్షేపణీయంగా ఉందనే విమర్శలొస్తున్నాయి. ఈ వివాదంపై సదరు బహుళ జాతి సంస్థ వెంటనే స్పందించింది. తెలియక తప్పు జరిగిందని, బెంగాలీ సమాజానికి క్షమాపణలు చెబుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.