Actress Kasturi | తమిళ సీనియర్ నటి కస్తూరిపై చెన్నైలో కేసు నమోదు అయ్యింది. తమిళనాడు బీజేపీ కార్యకర్త అయిన కస్తూరి తెలుగు ప్రజల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కస్తూరి బీజేపీ సభలో మాట్లాడుతూ.. తమిళనాడులో 300 ఏండ్ల క్రితం రాజుల కాలంలో అంత:పురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వాళ్లే తెలుగువారని.. అలా వచ్చినవారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడింది. అయితే తెలుగు ప్రజలపై కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో దిగొచ్చిన ఆమె మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నా వ్యాఖ్యలు మీ మనసును బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను మాట్లాడిన మాటలు పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను అని నటి కస్తూరి పేర్కొంది.
అయితే కస్తూరి చేసిన వ్యాఖ్యలపై తాజాగా చెన్నైలోని ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. తమిళనాడులోని తెలుగు ప్రజలు ఈ పిటిషన్ ఇవ్వగా.. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.