బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఆసక్తికరంగా సాగుతుంది. సోమవారం అంటే నామినేషన్ రచ్చతో హౌజ్ అంతా వేడెక్కిపోతుంది. ఈసారి నామినేషన్స్ ప్రక్రియను కాస్త విభిన్నంగా డిజైన్ చేశారు. హౌస్మేట్స్లో సన్నీ, జస్వంత్, శ్రీరామ్లు వేటగాళ్లుగా ఉంటారు. బయట సేవ్ ట్రీకి మిగిలిన ఇంటి సభ్యుల ముఖాలు అతికించి ఉన్న కోతుల బొమ్మల్ని వేలాడదీశారు.
గన్ సౌండ్ వినిపించినప్పుడల్లా వేటగాళ్లు కోతుల్ని చంపి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ సార్లు ఎవరు బయటకు వచ్చి ఎక్కువ కోతుల్నివేటాడతాడో అతను సేవ్ అవుతాడు. అలాగే జంగిల్ సౌండ్ వచ్చిన ప్రతిసారి.. లివింగ్ ఏరియాలో టేబుల్పై పెట్టిన రెండు అరటి పండ్లను హౌస్మేట్స్ పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అరటి పండ్లను పట్టుకున్న వాళ్లు వేటగాడితో చర్చించి.. ఒకరిని నామినేట్ అయ్యేలా ఒప్పించాలి.
ఈ టాస్క్ ఎంతో ఆసక్తికరంగా సాగగా, చివరకు ఈ వారం అనీ మాస్టర్, ప్రియ, సిరి, రవి, కాజల్తో పాటు, డేరా నుంచి ఒక్కసారి కూడా బయటకు రాని కారణంగా వేటగాళ్లు అయిన శ్రీరామ్, జెస్సీలు నామినేట్ అయ్యారు. ఇక సీక్రెట్ రూమ్లో ఉన్న లోబో హోస్ట్ ద్వారా నేరుగా నామినేట్ అయినట్లు బిగ్బాస్ ప్రకటించాడు. ఇందులో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది. ఇక కెప్టెన్సీ పోటీదారులకు కోడి గుడ్లను కాపాడుకునే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. నేడు ఈ టాస్క్ ఆసక్తికరంగా సాగనుంది.