‘రెండు గంటల సినిమా కనీసం రెండు రోజులైనా ఆలోచింపజేయాలి. నా ప్రతి సినిమాను అదే లక్ష్యంతో తీస్తాను’ అని చెప్పారు సునీల్కుమార్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘#69 సంస్కార్ కాలనీ’. ఎస్తర్, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. సునీల్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘సమకాలీన సమాజంలో మానవ సంబంధాల్లో వస్తున్న మార్పుల్ని, వింత పోకడల్ని ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నాం. సందేశాత్మకంగా ఉంటుంది. ఓ టీనేజ్ కుర్రాడికి, పెళ్లయిన అమ్మాయికి మధ్య జరిగే కథ ఇది. జీవితం, సమాజం పట్ల పరిణతితో ఆలోచించే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా అనంతరం ‘మా నాన్న నక్సలైట్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నా’ అన్నారు.