బిగ్ బాస్ సీజన్ 5లో 13వ వారం నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. సన్నీ.. తన ఫ్రెండ్స్గా ఉన్న కాజల్, మానస్, ప్రియాంకలను చేయలేను కాబట్టి.. మిగిలిన వాళ్లలో సిరి, శ్రీరామ్లు ఇద్దరే ఉన్నారు. వీళ్లు తప్ప నాకు ఆప్షన్ లేదు కాబట్టి అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. మానస్.. శ్రీరామ్ని నామినేట్ చేసి దెబ్బకి దెబ్బ కొట్టాడు. ఇక నియంత టాస్క్లో సిరి.. ప్రియాంకకి సపోర్ట్ చేశానని అనడం తనకి నచ్చలేదు అని చెబుతూ నామినేషన్ చేశాడు.
ఇక కాజల్.. కమ్యునిటీ అనే పదం ఉపయోగించినందుకు గానూ.. తనని నామినేట్ చేయడం పట్ల ఎమోషనల్ అయ్యింది . ప్రియాంక కెప్టెన్ కాలేదని.. తన కోసం స్టాండ్ తీసుకుని షణ్ముఖ్ని కన్వెన్స్ చేయడానికి కమ్యునిటీ అనే పదాన్ని వాడితే దాని కోసం తిరిగి ప్రియాంకే నన్ను నామినేట్ చేసింది. కమ్యునిటీ అంతే తప్పుకాదు. గ్రాఫ్ ఆఫ్ పీపుల్ని కమ్యునిటీ అంటారు. నేను ఎవర్నీ కించపరచడానికి అనలేదు.
నేను పింకీ కోసం మాట్లాడితే.. పింకీ నామినేట్ చేయడమే కాకుండా సిరి, షణ్ముఖ్లు ఇదే కారణంతో నామినేట్ చేశారు. అందుకే ప్రియాంక, సిరిలను నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది కాజల్. అయితే శ్రీరామ్ కాజల్ని నామినేట్ చేసినప్పటికీ అతన్ని వదిలేసి మరీ పింకీని నామినేట్ చేసింది కాజల్. మొత్తంగా 13వ వారంలో సిరి, మానస్, ప్రియాంక, శ్రీరామ్, కాజల్ ఈ ఐదురుగు నామినేట్ అయ్యారు. సన్నీ, షణ్ముఖ్లు సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక నామినేషన్ తర్వాత సిరి మళ్లీ షణ్ముఖ్కి హగ్గులు ఇచ్చి రచ్చ చేసింది.