గత కొన్నాళ్లుగా కమర్షియల్ సినిమాల్లో పాత్రల పరంగా నవ్యతను కోరుకుంటుంది రకుల్ప్రీత్సింగ్. మూస ఫార్ములాలకు భిన్నంగా కొత్తదనంతో కూడిన కథాంశాల్లో భాగమవుతోంది. తాజాగా ఆమె దక్షిణాదిలో ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ పేరుతో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతోంది. ఒక్కరోజు రాత్రిలో నలుగురు అమ్మాయిల జీవితాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో రకుల్ప్రీత్సింగ్ నటిస్తోంది. కథ నచ్చడంతో ఈ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ఆమె శుక్రవారం నుంచి షూటింగ్లో భాగమైనట్లు తెలిసింది. హైదరాబాద్లో ఏడు రోజుల పాటు జరిగే షెడ్యూల్లో రకుల్ప్రీత్సింగ్, విద్యుల్లేఖరామన్లపై దర్శకుడు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రకుల్ప్రీత్సింగ్తో పాటు నివేదా పేతురాజ్, మంజిమామోహన్, మేఘా ఆకాష్, రెబ్బా మోనికజాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విష్వక్సేన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలకానుంది.