ఆది పినిశెట్టి కథానాయకుడిగా అరివళగన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘శబ్దం’. సెవెన్ జీ ఫిల్మ్స్, ఆల్ఫా ప్రేమ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీ మీనన్ కథానాయికగా నటిస్తున్నది. తాజాగా ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో సీనియర్ నాయిక సిమ్రాన్ కనిపించనుంది. ‘ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
కథాగమనంలో కీలకమైన పాత్రలో సిమ్రాన్ కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమిది’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ పద్మనాభన్, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం, లైన్ ప్రొడ్యూసర్: అరివళగన్.