హెల్త్ ప్రమోషన్ స్పెషలిస్టు: ప్రస్తుతం పబ్లిక్, ప్రైవేట్ హాస్పిటల్స్ రెండింటిలో వీరికి అవకాశాలుంటాయి. ఏదైనా ఒక అంశం పట్ల, వ్యాధుల పట్ల అవగాహన కలిగించడం వీరి పని. డ్రగ్స్ను దుర్వినియోగం చేయడం, ఆల్క్హాల్ వినియోగం అలాగే డెంగ్యూ, మలేరియా, క్యాన్సర్, హృద్రోగ తదితర అంశాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఈ విషయాలపై సీనియర్స్కు సైతం శిక్షణ తరగతులు, వర్క్షాపులు, కమ్యూనిటీ క్యాంపెయిన్ వంటివి నిర్వహించవలసి ఉంటుంది. పబ్లిక్ హెల్త్లో మాస్టర్స్ చేసినవారికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కొంత అనుభవం సంపాదించిన తరువాత హెల్త్కేర్ ఎగ్జిక్యూటివ్గా హాస్పిటల్స్, కౌన్సెలింగ్ సంస్థలు, క్లినిక్స్, మెంటల్ హెల్త్ సంస్థలు, రిహాబిలిటేషన్ సెంటర్లు, హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు, హెల్త్కేర్ అసోసియేషన్స్, నర్సింగ్హోమ్స్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్, యూనివర్సిటీలు, రిసెర్చ్ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్, క్వాలిటీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్, ఆర్గాన్ ట్రాన్స్పోర్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, సోషల్ అండ్ సర్వీస్ కమ్యూనిటీ మేనేజర్స్, హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్టులుగా అవకాశాలు లభిస్తాయి. వేతనాలు కూడా పోస్టును బట్టి కనీసం ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు లభిస్తాయి.
హాస్పిటల్ అడ్మిన్రిస్టేటర్గా రాణించాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నాయకత్వ లక్షణాలుండాలి. సమస్యలను పరిష్కరించగలిగే నైపుణ్యం, డేటాను విశ్లేషించే సామర్థ్యం పెంచుకోవాలి. పరిశ్రమపై అవగాహన ఏర్పర్చుకోవాలి. త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే సమయస్ఫూర్తి ఉండాలి.
అంతేకాకుండా రెండేళ్ల అనుభవం ఉన్న ఎంబీఏ అభ్యర్థులకు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్- న్యూఢిల్లీ, డిగ్రీ పూర్తయి సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి.
హాస్పిటల్ మేనేజర్స్గా వివిధ విభాగాలను సమన్వయం చేయడానికి అవసరమైన ప్రణాళికను రచించుకోవాలి. డాక్టర్స్, ఫిజీషియన్స్, సర్జన్స్, నర్సులు, టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్లను సమన్వయపరిచే బాధ్యత వీరిదే. హాస్సిటల్స్ విస్తరణకు అవసరమైన మానవ వనరులను నియమించుకోవాలి. ఎక్కడ ఎంతమంది అవసరమో పరిశీలించి వారిని సర్దుబాటు చేయడం, నియామకాలకు అవసరమైన బడ్జెట్ను రూపొందించడం, ఆర్థిక అవకాశాలను (ఫైనాన్షియల్ రిసోర్స్) పరిశీలించడం, డేటాబేస్, ఐటీసిస్టమ్స్ నిర్వహణ బాధ్యత కూడా హాస్పిటల్ మేనేజర్స్దే. హాస్పిటల్కు సంబంధించి ప్రత్యేకంగా అకౌంట్స్, ఫైనాన్స్ విషయాలను పరిశీలించాలి. మొత్తం స్టాఫ్కు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. పేషెంట్లకు ఎటువంటి ఆటంకం లేకుండాచూస్తూ భద్రత కల్పించాలి. రోజు అనేక మందితో మాట్లాడాలి. పేషెంట్లను వారి తరఫున వచ్చే కుటుంబ సభ్యులను సంతృప్తిపరచాలి. మానవతా దృక్పథంలో సమస్యలను పరిష్కరించాలి. ఆర్థిక విషయాలను హ్యాండిల్ చేయాలి.
కొవిడ్-19 తరువాత ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో హెల్త్ సెక్టార్ జీడీపీలో ప్రస్తుతం ఉన్న 1.6 శాతాన్ని 2025 వరకు 2-5 శాతానికి పెంచాలని నిర్ణయించింది. కొవిడ్-19 తర్వాత హెల్త్కేర్ సెక్టార్లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిపుణులైన సిబ్బంది లేరు. మానవ వనరులు కొరత చాలా ఉంది. అందుకే అనేక కంపెనీలు హాస్పిటల్స్ హెల్త్కేర్ ప్రొఫెషనల్స్ కోసం ఎదురుచూస్తున్నాయి.
దేశం మొత్తంలో ఒక్కతెలంగాణలో మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సును నిమ్స్లో నిర్వహిస్తున్నారు. ఈ కోర్సు చేయాలనుకునే పేద విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ కూడా లభిస్తుంది. ఎంహెచ్ఎం కోర్సుకు చాలా డిమాండ్ ఉంది. ఈ కోర్సు చేసిన వారు విదేశాలతోపాటు మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ టూరిజం, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్, హెల్త్కేర్ మార్కెట్లో అవకాశాలు లభిస్తున్నాయి.
ఇటీవల కాలంలో మెడికల్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ విద్యార్థులను నియామకం చేసుకుంటున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం మాకు కాల్స్ వస్తున్నాయి. మా దగ్గర చదివిన విద్యార్థుల్లో ఒక్కరు కూడా ఖాళీగా లేరు. సీఈవోలుగా, సీవోవోలుగా, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా వివిధ జాబ్స్లో సెటిలయ్యారు. క్యాంపస్ రిక్రూంట్మెంట్లోనే అందరికీ దాదాపు అవకాశాలు లభిస్తాయి.
హాస్సిటల్ అడ్మిన్రిస్ట్రేషన్ మేనేజ్మెంట్ కోర్సు చేసిన వారు రూ.25,000 నుంచి రూ.30,000 వరకు ప్రారంభ వేతనంతో ఉద్యోగం లభిస్తుంది.. నిమ్స్లో కేవలం 20 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ కోర్సుకు ఉన్న డిమాండ్ రీత్యా సీట్లు పెంచే ఆలోచన కూడా ఉంది. ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగా స్పందిస్తుంది.
డా. మార్త రమేష్
అనుసంధాన అధికారి
నిమ్స్, హైదరాబాద్
–మణిమాల