ముంబై : ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ అయిన జోమాటోలో ఒకవైపు నష్టాలు (Zomato Losses) పెరుగుతున్నప్పటికీ.. దాని వేగంలో మాత్రం వెనుకంజ లేదు. గత ఏడాది నష్టం రూ.99.8 కోట్లు ఉండగా.. ఈ ఏడాది అది రూ.356 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో కంపెనీ స్టాక్ మాత్రం 5 శాతం పెరుగుదల కనిపించడం విశేషం.
తొలి త్రైమాసిక ఫలితాలను జోమాటో బుధవారం విడుదల చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.99.8 కోట్లకు గాను ఏప్రిల్-జూన్లో కంపెనీ నష్టం 256 శాతం పెరిగి.. రూ.356.2 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.266 కోట్లతో పోలిస్తే, జోమాటో మొత్తం ఆదాయం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.844.4 కోట్లుగా ఉన్నది. కంపెనీ సర్దుబాటు చేసిన పని నష్టం గత త్రైమాసికంలో రూ.120 కోట్లకు గాను రూ.170 కోట్లుగా ఉన్నది. కరోనా మహమ్మారి వ్యాప్తి ఉన్నప్పటికీ, ప్రధాన వ్యాపార వృద్ధి బలపడిందని కంపెనీ పేర్కొన్నది. అలాగే, రెస్టారెంట్లలో కూర్చుని తినే వారి సంఖ్య తగ్గడం వల్ల కూడా లాభపడినట్లు తెలిపింది.
ఏప్రిల్-జూన్ నెలలో ఆన్లైన్ ఆర్డర్ల వ్యాపారం వేగంగా నాలుగింతలు పెరిగింది. ఇందులో సంవత్సరానికి రూ.4,450 కోట్లకు ఆదాయం లభించింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఫుడ్ డెలివరీ వ్యాపారంలో మార్జిన్లు తగ్గాయని, అయితే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున మెరుగైన వృద్ది సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. ఏప్రిల్-జూన్ ఈ కాలంలో అధిక ఖర్చుల కారణంగా కంపెనీకి నష్టాలు పెరిగాయి. కంపెనీ మొత్తం వ్యయం రూ.1,259.7 కోట్లు. కాగా, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.383.3 కోట్లు. ఎంప్లాయిస్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈఎస్ఓపీ) పై పెరిగిన వ్యయం కారణంగా కంపెనీకి నష్టాలు పెరిగాయని జోమాటో సీఈఓ దీపేందర్ గోయల్ తెలిపారు.
ఆఫ్ఘాన్లో దిగజారిన పరిస్థితి : ఇండియా తిరిగొచ్చిన 50 మంది
డయాబెటిస్ను ఇలా కూడా ముందే గుర్తించొచ్చు..!
ఇస్రో మరో మైలురాయి.. ఆకాశంలో మన ‘కన్ను’
చిన్నారిని చంపేసిన ఆన్లైన్ చదువు
చేతిలో భగవద్గీత.. నవ్వుతూ ఉరికంభంపైకి..
అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..