హైదరాబాద్, మార్చి 24: రక్షణ శిక్షణ పరిష్కారాల సంస్థ జెన్ టెక్నాలజీస్కి భద్రత దళాల నుంచి రూ.127 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. ఈ సందర్భంగా జెన్ టెక్నాలజీ సీఎండీ అశోక్ అట్లూరి మాట్లాడుతూ..భారత ప్రభుత్వం ఇటీవల సాయుధ దళాల్లోకి అనుకరణ యంత్రాల ప్రవేశాన్ని వేగవంతం చేసిందని, ఇందుకోసం 2021లోనే ప్రత్యేక ఫ్రేమ్వర్క్ను కూడా విడుదల చేసినట్లు చెప్పారు.
భద్రత దళాలకు మెరుగైన శిక్షణ అందించడానికి తమవంతుగా కృషి చేయనున్నట్లు చెప్పారు. శిక్షణతోపాటు డ్రోన్లు, యాంటీ-డ్రోన్ పరిష్కారాలకు సంబంధించిన సేవలు కూడా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.