న్యూఢిల్లీ, జూలై 23: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.311 కోట్ల నికర లాభాన్ని గడించింది యెస్ బ్యాంక్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.207 కోట్లతో పోలిస్తే 50 శాతం అధికమని పేర్కొంది. ఇక యెస్ బ్యాంక్ ఆదాయం రూ. 5,394 కోట్ల నుంచి రూ.5,916 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. స్థూల నిరర్థక ఆస్తుల విలువ 15.60 శాతం నుంచి 13.45 శాతానికి తగ్గినట్లు వెల్లడించిన బ్యాంక్..నికర ఎన్పీఏ కూడా 5.78 శాతం నుంచి 4.17 శాతానికి దిగొచ్చింది. మొండి బకాయిలు పూడ్చుకోవడానికి బ్యాంక్ కేవలం రూ.175 కోట్ల నిధులు మాత్రమే కేటాయించడంతో లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని పేర్కొంది. మరోవైపు, బ్యాంక్ ఎండీ, సీఈవోగా ప్రశాంత్ కుమార్ నియమితులయ్యారు. మూడేండ్లపాలు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు.