న్యూఢిల్లీ : యమహా ఏరక్స్ 155 స్కూటర్ శ్రేణిలో యమహా మోటార్ ఇండియా తాజాగా న్యూ మెటాలిక్ బ్లాక్ కలర్ ఆప్షన్ను లాంఛ్ చేసింది. ఈ స్కూటర్ లాంఛ్ అయినప్పటి నుంచి మెరుగైన ఆదరణ రాబడుతుండగా న్యూ కలర్ ఆప్షన్ ధరను రూ 1,29,000గా కంపెనీ ప్రకటించింది. ఈనెలలోనే యమహా డీలర్ల వద్ద న్యూ మెటాలిక్ బ్లాక్ యమహా ఏరక్స్ 155 స్కూటర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఇక ఈ స్కూటర్ ఇప్పుడు రేసింగ్ బ్లూ, గ్రే, బ్లాక్ కలర్ ఆప్షన్స్లో కస్టమర్లకు లభిస్తుంది. మరో రూ 1500 అదనపు ధరతో కస్టమర్లు మాన్స్టర్ ఎనర్జీ మోటోజీపీ రేసింగ్ లైవరీని కూడా ఎంచుకోవచ్చు. ఇక యమహా ఏరక్స్ 155 ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, 12 ఎల్ఈడీలతో 3డీ టెయిల్లైట్తో షార్ప్ డిజైన్తో స్పోర్టీ లుక్తో ఆకట్టుకుంటుంది. 5.8 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లేతో కూడిన స్పీడోమీటర్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, నేవిగేషన్, వైకనెక్ట్ యాప్తో చివరిసారిగా పార్క్ చేసిన లోకేషన్ ఇన్ఫో ట్రాకింగ్ సహా పలు ఇతర ఫీచర్లున్నాయి.