Xiaomi EV | న్యూఢిల్లీ, మార్చి 25: ఈవీ రంగంలోకి మరో సంస్థ అడుగుపెట్టబోతున్నది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ..తాజాగా ఈ గురువారం తన తొలి ఈవీ మాడల్ను విడుదల చేయబోతున్నది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో లియో జున్ స్పష్టంచేశారు. రెండు రకాల్లో లభించనున్న తొలి ఎలక్ట్రిక్ వాహనమైన ఎస్యూ7, ఎస్యూ7 మ్యాక్స్ మాడళ్లు ఉన్నాయి. ఈ మాడల్ ధర 5 లక్షల యూవాన్ (69,424 డాలర్లు) లోపు ఉంటుందని అంచనా.
రెండు రకాల్లో లభించనున్న ఈ మాడళ్లలో 73.6 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ సింగిల్ చార్జింగ్తో 668 కిలోమీటర్లు, 101 కిలోవాట్ల బ్యాటరీ 800 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ వాహనాన్ని డిసెంబర్లోనే ప్రదర్శించింది. అంతర్జాతీయ ఈవీ దిగ్గజాలు టెస్లా, పోర్షే కంటే టెక్నాలజీ పరంగా అత్యాధునికంగా డిజైన్ చేసినట్లు కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. వచ్చే పదేండ్లలో ఈవీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి 10 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నది షియోమీ. ఈవీలను తయారు చేయడానికి చైనాలో సరికొత్తగా ప్లాంట్ను నెలకొల్పుతున్నది.
వాహనాల ప్రత్యేకతలు