Xiaomi | భారత్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ హవా సాగుతున్నది. ఏప్రిల్-జూన్ మధ్య ఫోన్ల విక్రయాలు 22 శాతం తగ్గినా.. షియోమీ అదరగొట్టింది. మొత్తం స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో షియోమీ 20 శాతం, శ్యామ్సంగ్ 18 శాతం ఫోన్లు విక్రయించాయని సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) పేర్కొంది. 5జీ ఫోన్ల క్యాటగిరీలో శ్యామ్సంగ్ 28 శాతం మార్కెట్ వాటా సంపాదించుకున్నది. 5జీ స్మార్ట్ ఫోన్ల సేల్స్ ఏడు శాతం పెరిగింది. 2022 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అద్భుతమైన గ్రోత్ నమోదైంది. 2021తో పోలిస్తే 163 శాతం వృద్ధి నమోదైంది. రూ.50,000-రూ.లక్ష మధ్య క్యాటగిరీ గల ఐ-ఫోన్12, ఐఫోన్13 సిరీస్ ఫోన్లు 78 శాతం వాటా పొందాయి.
ఓవరాల్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో రియల్ మీ సేల్స్ 22 శాతం ఉన్నాయి. తర్వాతీ స్థానంలో వివో, ఒప్పో నాల్గవ (15 %), , ఐదో స్థానం (10శాతం) లో కొనసాగుతున్నాయి. ఫీచర్ ఫోన్ల సెగ్మెంట్లో చైనా సంస్థ టైల్ 25 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. లావా 21 శాతం, శ్యామ్ సంగ్ 11 శాతం, నోకియా 8 శాతం వాటా పొందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 174 మిలియన్ల ఫోన్లు అమ్ముడవుతాయని సీఎంఆర్ అంచనా వేసింది. ప్రస్తుత త్రైమాసికంలో ఓవరాల్ సూక్ష్మ-ఆర్థిక పరిస్థితుల వల్ల స్మార్ట్ ఫోన్ల సేల్స్ తగ్గుతాయని సీఎంఆర్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ అనలిస్ట్ మేనకా కుమారి ఓ ప్రకటనలో తెలిపారు.