స్మార్ట్ పరికరాల తయారీ సంస్థ షియోమీ..100 బిజినెస్ స్కూళ్ళ నుంచి 305 ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకున్నది. సేల్స్, మార్కెటింగ్, సరఫరా విభాగాల్లో వీరిని నియమించుకున్నది. ఈ సందర్భంగా షియోమీ ఇండియా సీనియర్ డైరెక్టర్ హెచ్ఆర్ వరుణ్ మోహన్ మాట్లాడుతూ..నూతన ఆలోచనలతో ఉన్న ఫ్రెషర్లను వందకి పైగా బిజినెస్ స్కూళ్ళ నుంచి రిక్రూట్ చేసుకున్నట్లు చెప్పారు.
తాజాగా నియమించుకున్న 305 మంది సిబ్బందిలో 50-55 శాతం మంది మహిళలు కావడం విశేషమన్నారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,550కి చేరుకుంది.